Fri. Apr 19th, 2024
youth_health

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 24,2023: నానాటికీ పెరుగుతున్న మధుమేహం ప్రభావం శారీరకంగానూ, ఆర్థికంగానూ ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తోంది.

సైలెంట్ కిల్లర్ గా ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చేది, కానీ నేడు 20, 30 ఏళ్ల వయసులో కూడా వస్తోంది. భారతదేశం ఇప్పటికే ప్రపంచ మధుమేహ రాజధానిగా మారుతోంది.

అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దిగజారవచ్చని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో ఇప్పుడు దాదాపు 70 మిలియన్ల మందిపైగా మధుమేహ రోగులు ఉన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఈ సంఖ్య 45 శాతం పెరిగి 2030 నాటికి 101 మిలియన్లకు చేరుకుంటుంది.

youth_health

యువత మధుమేహంపై ఆధునిక జీవనశైలి ప్రభావం..


కార్పొరేట్ రంగంలో పనిచేసే వ్యక్తులు సగటున రోజుకు పది గంటలు పని చేస్తారు. ఇందులో ఎక్కువ సమయం కూర్చొనే గడుపుతారు. అంతేకాదు సులభంగా లభించే ఫాస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్ హోమ్ ఫుడ్ స్థానాన్ని ఆక్రమిస్తోంది.

అంతేకాదు నిద్ర పూర్తిగా అందడం లేదు. సమాజంలో తనను తాను ఉన్నతంగా నిరూపించుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. స్ట్రోక్, డిప్రెషన్, ఒత్తిడి, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులకు కారణమవుతుంది.