Sat. Apr 20th, 2024
VIRTUAL VARALAKSHMI VRATAM AT TIRUCHANOORK ON AUGUST 20
VIRTUAL VARALAKSHMI VRATAM AT TIRUCHANOORK ON AUGUST 20
VIRTUAL VARALAKSHMI VRATAM AT TIRUCHANOORK ON AUGUST 20

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుపతి, ఆగ‌స్టు6, 2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగ‌స్టు 20న వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా జరుగనుంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో టిటిడి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు వీలుగా ఈ టికెట్ల‌ను టిటిడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

VIRTUAL VARALAKSHMI VRATAM AT TIRUCHANOORK ON AUGUST 20
VIRTUAL VARALAKSHMI VRATAM AT TIRUCHANOORK ON AUGUST 20

ఆగ‌స్టు 20న ఉద‌యం అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు ఏకాంతంగా అభిషేకం చేస్తారు. ఉద‌యం 10 నుంచి12 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌కృష్ణ ముఖ మండ‌పంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం నిర్వ‌హిస్తారు. ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు ఉత్త‌రీయం, ర‌విక‌, కుంకుమ‌, అక్షింత‌లు, కంక‌ణాలు, డ‌జ‌ను గాజులు ప్ర‌సాదంగా ఇండియా పోస్ట‌ల్ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంప‌డం జ‌రుగుతుంది. పోస్ట‌ల్ ఛార్జీతో క‌లిపి ఈ సేవా టికెట్ ధ‌ర‌ను రూ.1001/-గా నిర్ణ‌యించారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా వ‌ర్చువ‌ల్ టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు.