Thu. Mar 28th, 2024
Nonvej

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం,జనవరి 29,2023:ఖమ్మం నగరంలో మమత హాస్పిటల్ రోడ్డు ఇ.ఆర్.ఆర్ గార్డెన్ నుంచి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూమెంట్ ఇండియా (పీఎంసీ) ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహా పత్రీజీ గురువు మార్గదర్శకత్వంలో ధ్యానులు అందరూ కలిసి మూగజీవుల పరిరక్షణకొరకు మహాకరుణ శాఖాహార ర్యాలీని నిర్వహించారు.

మహాకరుణ అఖండ శాకాహార ర్యాలీ పలు సెంటర్లు మీదుగా మాంసాహారం వద్దు శాఖాహారం ముద్దు అని బారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం అని , మాంసాహారం వద్దు శాఖాహారం ముద్దు అని, మనిషి భూమి మీదకు వచ్చిన తర్వాత..

మొట్టమొదట ఆకులు, అలమలు, పండ్లు తిని జీవించాడని కాలం మారుతున్న తరుణంలో మాంసాహారంగా మారాడని , మాంసం తినడం వల్ల క్రూరమృగంగా మారుతాడని మానవ మనగడ కొన్ని వేల సంవత్సరాలు జీవించాలంటే శాఖాహారం భుజించాలని అన్నారు.

మాంసాహారం వల్ల అనేక నష్టాలు కలుగుతాయని, శాఖాహారం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, మానవులు పూర్తిగా శాకాహారముగా మారినప్పుడే మానవజాతికి ఒక అర్థం ఉంటుందని తెలిపారు.

జంతువులలో అనేక దేవుళ్ళు నిక్షితమై ఉంటారని కావున జంతు హింస మహా పాపమని అన్నారు . వాడవాడల్లో పిరమిడ్ లు ఏర్పాటు చేయాలని , సకల జనులకు ధ్యానం గురించి తెలియజేసి నేర్పించాలన్నారు.

Nonvej

ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకలభోగకారిణి , ధ్యానం సత్య జ్ఞానప్రసాదిని అని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ మరం ప్రసాద్ , భాస్కర్ రెడ్డి , సొసైటీ అధ్యక్షులు శైలజ మేడం, ఆనంద్ , ప్రసాద్ , సీతయ్య , పుల్లకొండ వెంకటేశ్వరరావు , విజయలక్ష్మి , రాజర్షి రాజశేఖర్ , మన్యం కృష్ణ తదితరాలు పాల్గొన్నారు.