Thu. Mar 28th, 2024
Jamalapuram_temple_

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం జిల్లా, జనవరి 2, 2023: వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం జమలాపురం ఆలయంలో వైభవంగా జరిగాయి.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జామునుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు.

ఈ సందర్భంగా సుమారు 10 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించు కున్నారు. దేవస్థాన సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాస్, ఉప ప్రధానార్చకులు ఉప్పల విజయ్ దేవ శర్మ, అర్చకులు ఉప్పల రాజీవ్ శర్మ, వేద పండితులు ఘనంగా నిర్వహించారు.

Jamalapuram_temple_

ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఉప్పల కృష్ణమోహన్ శర్మ ,ప్రత్యేక దాత తుళ్లూరు కోటేశ్వర్ రావు నిర్మల కుటుంబ సభ్యులు, సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బందితో ఎర్రుపాలెం ఎస్సై యం.సురేష్ బందోబస్తు నిర్వహించారు.