Thu. Mar 28th, 2024
AnuragThakur_365

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కపుర్తలా,మార్చి 4,2023: యువ ఉత్సవ్- ఇండియా @ 2047 జాతీయ యువజన ఉత్సవాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. పంజాబ్ లోని రోపర్ ఐఐటీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఠాకూర్ ఈ ఉత్సవాలను,యువ ఉత్సవ్ డాష్ బోర్డు కూడా ప్రారంభించారు.

యువ ఉత్సవాలు ఏకకాలంలో ప్రతాప్‌గఢ్ (యు.పి.), హరిద్వార్ (ఉత్తరాఖండ్), ధార్ , హోసంగాబాద్ (ఎం.పి.), హనుమాన్‌గఢ్ (రాజస్థాన్), సరైకేలా (జార్ఖండ్), కపుర్తలా (పంజాబ్), జల్గావ్ (మహారాష్ట్ర), విజయవాడ (ఆంధ్ర ప్రదేశ్). కరీంనగర్ (తెలంగాణ), పాలఖడ్ (కేరళ), కడలూరు (తమిళనాడు)లో ప్రారంభమయ్యాయి. మొదటి దశలో భాగంగా 31 మార్చి 2023 నాటికి దేశవ్యాప్తంగా 150 జిల్లాల్లో యువశక్తిని పురస్కరించుకుని యువ ఉత్సవాలు నిర్వహించనున్నారు.

AnuragThakur_365

ప్రారంభ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఠాకూర్ మాట్లాడుతూ.. “దేశానికి స్వాతంత్య్రం సాధించడానికి సమరయోధులు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశానికి సేవ చేసి స్వాతంత్య్ర సమరయోధులు గర్వించేలా చేయాలని” ఆయన కోరారు.

“ప్రపంచంలోనే అతిపెద్ద యువ-శక్తి భారతదేశంలో ఉంది. యువతలో దాగి ఉన్న శక్తి, సామర్థ్యాన్ని వెలికి తీయాలి .” అని ఆయన అన్నారు.’ విద్యార్థులు తమ హృదయానికి దగ్గరగా ఉండే ఒక సామాజిక అంశాన్ని ఎంచుకుని సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి కృషి చేయాలి’ అని మంత్రి ఠాకూర్ సూచించారు. “యువత రేపటి దేశ నిర్మాతలు” అని అన్నారు.

చిరుధాన్యాల ప్రాముఖ్యత, ప్రాధాన్యతను గురించి ఆయన ఈ సందర్భంగా ఠాకూర్ వివరించారు. ‘చిరుధాన్యాల వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. నీటి వినియోగం తగ్గుతుంది. భూసారాన్ని రక్షించడానికి వీలవుతుంది.’ అని చెప్పారు.

“నేడు పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలు కలిగి ఉన్న దేశాల జాబితాలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. దేశంలో 107 యునికార్న్స్ పనిచేస్తున్నాయి. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలు ఏర్పాటు అవుతున్న దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది.

ఒక్కప్పుడు బలహీన ఆర్థిక వ్యవస్థ గల దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం నేడు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న 5వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించింది. స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి, అమలు చేసిన కార్యక్రమాల వల్ల ఇదంతా సాధ్యమైంది’’ అని మంత్రి ఠాకూర్ అన్నారు.