365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంద్రప్రదేశ్,సెప్టెంబర్ 2,2022: అంబేద్కర్ జిల్లా కోనసీమలో విద్యుదాఘాతానికి గురై మామ, అల్లుడు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని రావులపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన మామ, అల్లుడు మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మామ అర్లప్ప(50), అల్లుడు వెంకట రమణ(35) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మన్యం జిల్లా పాపటపల్లి వాసులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.