Tue. Apr 16th, 2024
Two killed in a road accident

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి ,సెప్టెంబర్ 18,2022: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలి గ్రామంలోని అలిగుంటపాలెం క్రాస్‌రోడ్‌ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళితే, కారు నెల్లూరు నుంచి ఒంగోలుకు వస్తుండగా డివైడర్‌ను ఢీకొని పంట కాల్వలోకి దూసుకెళ్లింది.

Two killed in a road accident

ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.