365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,సెప్టెంబర్ 01:కర్ణాటక రాష్ట్రం, శృంగేరిలోని శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామిని బుధవారం టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి కలిశారు.
శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామివారికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి ఆశీస్సులు అందుకున్నారు. ఇటీవల కాలంలో భక్తుల కోసం చేపట్టిన పలు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను ఈ సందర్భంగా ఈవో వివరించారు.