365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, జనవరి 5, 2023: యూపీఐ మోసాలు, ఫిషింగ్ వల్ల కలిగే ఆర్థిక నష్టాలను అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన సేఫ్ హౌస్ టెక్ శ్రీకారం చుట్టింది. సైబర్ బీమా కవరేజీతో సంపూర్ణ రక్షణ కల్పించేందుకు సిద్ధమైంది.
సేఫ్ హౌస్ టెక్ సైబర్ సెక్యూరిటీ కోసం తెలంగాణతోసహా ఇతర రాష్ట్రాల్లో తన బాడీగార్డ్ యాప్ ద్వారా ప్రత్యేకమైన సైబర్ బీమాను అందించడానికి హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్తో భాగస్వామ్యం చేసుకుంది.
ఇప్పటికే వివిధ డిజిటల్ ప్రొటెక్షన్ ఫీచర్లను అందిస్తున్న ఈ యాప్, ఇప్పుడు వ్యక్తిగత కస్టమర్ల కోసం డిజిటల్ మోసాల నుంచి ఆర్థిక నష్టాలకు కవరేజీని అందిస్తోంది.
అనధీకృత డిజిటల్ లావాదేవీలకు హెచ్డీఎఫ్సీ ఎర్గో నుంచి ఒక సంవత్సరం రూ. 25వేల కాంప్లిమెంటరీ కవరేజీతోపాటు మద్దతు, ప్రత్యేక క్లెయిమ్ డెస్క్ ను అందించడం ద్వారా సైబర్ బీమా కవర్ వినియోగదారులకు “ఇంటర్నెట్-బీమా”ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
సేఫ్ హౌస్ టెక్ సురక్షితమైన, ప్రైవేట్ ఇంటర్నెట్ అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టింది. కస్టమర్లకు ఆర్థిక నష్టాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా సైబర్ బీమాను ప్రారంభించింది.
భారతదేశంలో సైబర్ బీమాను అందించే మొదటి సైబర్ సెక్యూరిటీ కంపెనీగా, సేఫ్ హౌస్ టెక్ ఆర్థిక, సైబర్ నేరాల నుంచి వ్యక్తులు సురక్షితం ఉంచుతూ ఒకవేళ నష్టపోతే బీమా పరిహారం పొందేలా చూస్తుంది.
దేశంలో సైబర్ నేరాల్లో అత్యధిక కేసులు నమోదైన మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక్కడ జరిగేవాటిలో దాదాపు 85శాతం కేసులు ఆర్థిక నేరాలే అవుతున్నాయి.
ఈ సందర్భంగా సేఫ్ హౌస్ టెక్ ఎండి-ఇండియా రుచిర్ శుక్లా మాట్లాడుతూ, “సేఫ్ హౌస్ టెక్లో నిరంతరం పెరుగుతున్న 2.5 మిలియన్ల వినియోగదారు లకు అత్యంత సురక్షితమైన, ప్రైవేట్ ఇంటర్నెట్ అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు.
హెచ్డీఎఫ్సీ ఎర్గో ద్వారా అందించే రూ.25వేల విలువైన ఆర్థిక నష్టం కవరేజితో బాడీగార్డ్ వీఐపీ ప్లస్ ప్రొడక్టుకు సంబంధించిన మా పాలసీ మొట్టమొదటి ప్యాకేజీని తెలంగాణకు తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది.
మాకు ఇప్పటికే ఉన్న, కొత్త వినియోగదారులు వారికి ఇప్పటికే కలిగి ఉన్న అత్యాధునిక సైబర్ రక్షణతో పాటు, ఇప్పుడు ఈ కవరేజీతో ఆర్థిక నష్టాలను తగ్గించుకోవచ్చని అన్నారు.
గత ఏడాది కాలంలో భారతదేశంలో యూపీఐ డిమాండ్, వినియోగం గణనీయంగా పెరిగడంతో యూపీఐ మోసాల కేసులు కూడా మరింతగా పెరిగాయి. 2022 లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో యూపీఐ మోసాలకు సంబంధించి ఏకంగా 1,46,495 కార్యకలాపాలను రిపోర్ట్ చేశారు.
మొదటి త్రైమాసికంలో (క్యూ 1) 62,350 యూపీఐ సంబంధిత ఫిర్యాదులు, రెండో త్రైమాసికంలో (క్యూ 2) 84,145 ఫిర్యాదులు వచ్చాయి. యూపీఐపై ఆధారపడటం 2023లో మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు.