Thu. Mar 28th, 2024
MLA_bhattivikramarka

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం, మార్చి6, 2023: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన షాదీ ముబారక్,కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మధిర ఎమ్మెల్యే భట్టీ విక్రమార్క ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా 44 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు అందజేశారు. ఎర్రుపాలెం మండలంలోని బీసీ, ముస్లిం మైనారిటీలకు చెందిన లబ్దిదారులకు భట్టీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “లబ్ధిదారులు కల్యాణ లక్ష్మి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని” సూచించారు.

MLA_bhattivikramarka

ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, మండల తాసిల్దార్ తిరుమల చారి, ఎంపీఓ శ్రీలక్ష్మి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు చావా రామకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, పెద్దగోపవరం ఎంపీటీసీ కిషోర్ బాబు, ములుగు మాడు ఎంపీటీసీ సూరానేని రామకోటయ్య,పలుగ్రామాల సర్పంచులు మొగిలి అప్పారావు, జంగా పుల్లారెడ్డి, మారబత్తుల మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు.