Fri. Mar 29th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 5, 2021:సెప్టెంబరు 10వతేదీన సాయిధరమ్ తేజ్ రోడ్డుప్రమాదానికి గురై తీవ్రగాయాలతో ఆసుపత్రిలో పాచేరారు. అపోలో ఆసుపత్రిలో కాలర్ బోన్ కు సర్జరీ చేసిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికే పరిమితం అయ్యారు. దీపావళి పండుగ వేడుకలకు చిరంజీవి ఇంటికి వచ్చిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తన మేన మామలు, బావ,మరుదులతో కలిసి సందడి చేశారు.


ట్విట్టర్ లో చిరంజీవి స్పందించారు. అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని మెగాస్టార్ చిరు తెలిపారు. మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అంటూ.. చిరంజీవి తన కుటుంబ సభ్యులతో ఉన్నఫొటో ను ట్విట్టర్ లో షేర్ చేశారు. చిరంజీవి తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చెయ్యి వేసి కనిపించగా, పక్కనే పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ కొడుకు అకీరా నందన్ లు ఉన్నారు.