Thu. Apr 25th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమ‌ల‌,జూన్1,2022: తిరుమ‌ల మొద‌టి ఘాట్ రోడ్డు నడకమార్గంలో వెలసివున్నశ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో బుధ‌వారం ఉద‌యం మండ‌లాభిషేకం సంద‌ర్భంగా స్వామివారికి ఏకాంతంగా ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌లశాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

ఇటీవ‌ల శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో అష్ట‌బంధ‌న మహాసంప్రోక్షణ చేసిన విష‌యం విదిత‌మే.

సంప్రోక్ష‌ణ చేసి మండ‌లం రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా ఉద‌యం 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌లశాభిషేకం జ‌రిగింది.