Thu. Mar 28th, 2024
khammam-mirchi_365

క్వింటాల్‌కు రూ.25,550 పలికిన మిర్చి ..

జెండా పాటలో పాల్గొన్న మంత్రి పువ్వాడ.

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మంజిల్లా, మార్చి 20,2023: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్‌ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం.

ఖమ్మం మార్కేట్ ను అంతర్జాతీయ మార్కేట్ కు చిరునామాగా తీర్చిదిద్దు తామని చిల్లీస్ కు హబ్ గా చేస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

సోమవారం ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్లో నిర్వహించిన జెండా పాటలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని జెండా పట్టి ధర నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో ఖమ్మం మిర్చి మార్కెట్ లో రికార్డు స్థాయిలో ధర పలికిందని చెప్పారు.

khammam-mirchi_365

కొన్ని క్వింటాలే కాదు…రైతులు పండించిన ప్రతి బస్తా కొనుగోలు చేస్తారన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం లాభసాటిగా మారిందని, మనం పండించే మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందన్నారు.

చైనా దేశం మిర్చి కంపెనీలు ఖమ్మంలో ఎర్పాటు చేసి చైనా కి క్వాలిటీ మిర్చి ఎగుమతి చేస్తున్నాయన్నారు. మిర్చి ఘాటు కంటే రైతుల మీద ప్రేమ ఎక్కువ అని, అందుకే రైతుల ప్రయోజనాలు ముఖ్యమని మంత్రి అజయ్ పేర్కొన్నారు.