Fri. Apr 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 30, 2023: శ్రీకృష్ణ జ్యువెలర్స్ బంజారాహిల్స్ స్టోర్10వ వార్షికోత్సవ సంబరాలు జరుపుకొంటుంది. ఈ వేడుకల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ పాల్గొన్నారు.

ఏప్రిల్ 22 నుంచి మే 1వ తేదీ వరకు శ్రీ కృష్ణ జ్యువెలర్స్ నిర్వహిస్తున్న10 రోజుల వెడ్డింగ్ కార్నివాల్‌లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ స్టోర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కస్టమర్‌లతో ఇంటరాక్ట్ అవ్వడమే కాకుండా, స్టోర్‌లో ప్రదర్శించిన ఆభరణాల కలెక్షన్ తో రకుల్ ఫోటోలకు పోజులిచ్చింది.

స్టోర్‌లో జరిగే 10-రోజుల వేడుకలో వెడ్డింగ్ ఈవెంట్ ఎక్స్పర్ట్స్ తో ఇంటరాక్షన్‌లు వంటివి ఇక్కడ ఏర్పాటు చేశారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ మేకర్స్, సమిష్టి డిజైనర్ల నుంచి హెయిర్ అండ్ మేకప్, డెకర్ ,వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌ల వరకు అన్నీ అంశాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు.