365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 8,2022: ఇటీవల అరెస్టు అయిన బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్ భార్య ఉషా బాయి భారతజనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ను కలుసుకున్నారు. తన భర్తను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
పార్టీ కేంద్ర నాయకత్వం రాజా సింగ్కు జారీ చేసిన షో కాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని ఆమె పార్టీ అధ్యక్షుడిని అభ్యర్థించారు. రాజా సింగ్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయినప్పటినుంచి ఎప్పుడూ బయటకు రాని ఆమె పార్టీ కార్యాలయానికి మొదటి సారి తన భర్త కోసం వచ్చారు.
గతంలో రాజా సింగ్ సస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తూ రాష్ట్ర బిజెపి నాయకులు కేంద్ర నాయకత్వానికి రాసినట్లు తెలిపారు. అంతేకాకుండా, ఈ విషయంలో రాజా సింగ్కు చట్టపరమైన సహాయాన్ని అందించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు చెప్పారు. బిజెపి నాయకులు రఘునందన్ రావు, రామ్చంద్రరావు ఇప్పటికే రాజా సింగ్కు చట్టబద్ధంగా మద్దతు ఇస్తున్నారు.