Fri. Apr 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,నేషనల్,డిసెంబర్ 26,2021:ఆర్చ్ బిషప్ ఎమిరిటస్ డెస్మండ్ టుటు మరణంపై  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో -“ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ డెస్మండ్ టుటు ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజానీకానికి మార్గదర్శకులుగా నిలిచారు. మానవాళిపై గౌరవం..సమానత్వాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం  చిరస్మరణీయం. ఆయన మృతిపై నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా ఆయన అభిమానులందరికీ నా హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.