Thu. Mar 28th, 2024
Supreme-_Court_365telugu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, మార్చి 25,2023: ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఐతే ఈ నిర్ణయం ప్రతిపక్ష పార్టీలను ఆగ్రహానికి గురి చేసింది.

వారు దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా ఖండించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనను ప్రకటించింది. సూరత్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ . రాహుల్ దోషిగా తేలిన తర్వాత ఎంపీ సభ్యత్వరద్దుకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Supreme-_Court_365telugu

పిటిషన్‌లో డిమాండ్ ఏమిటి..?

సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తుంది, ఇది ఏదైనా కోర్టు కేసులో దోషిగా తేలితే ఆయాప్రజాప్రతినిధి సభ్యత్వాన్ని ఆటోమేటిక్ గా అనర్హులుగా చేస్తుంది.

మోడీ ఇంటిపేరుపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి శిక్ష విధించిన మరుసటి రోజే ఆయన లోక్ సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడింది. ఇప్పుడు శనివారం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది, దోషులుగా తేలిన తర్వాత శాసనసభకు ఎన్నికైన ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించరాదని డిమాండ్ చేశారు.