Thu. Mar 28th, 2024
pawan-meeting-Pm-modi

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,విశాఖపట్నం, నవంబర్11, 2022: ప్రధాని మోదీని కలిసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. “భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు ఈ రోజు జరిగిన మీటింగ్ మంచి రోజు తీసుకువస్తుందని నమ్ముతున్నా” అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. “సుమారు 8 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి మోడీతో సమావేశ మయ్యాను.. రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విశాఖ వస్తుంది సందర్భంగా భేటీ పై సమాచారం ఇచ్చారు”.

http://dhunt.in/FbJJd

ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన మీటింగ్ ఇది: పవన్ కళ్యాణ్

pawan-meeting-Pm-modi

https://m.dailyhunt.in/buzz/video/telugu/misc/pradhaani+modini+kalishaaka+pavan+kalyaan+kaaments-dh4fcab02e50334d6f8a069dbf5eaa5131_77a9db7061ec11ed96bf73b9fd74346c

“ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశ్యం, ప్రధానమంత్రి ఆకాంక్ష ఆకాంక్ష , ఆంధ్రప్రదేశ్ బాగుండాలి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందాలి అని. తెలుగు ప్రజల సఖ్యత బాగుండాలి” అని పవన్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. నాకు అవగాహన ఉన్నంతమేరకు అన్ని విషయాలను తెలియజేశాను..మిగిలిన విషయాలు తరువాత తెలియజేస్తా” అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

https://m.dailyhunt.in/buzz/video/telugu/misc/pradhaani+modini+kalishaaka+aasaktikara+kaamentschesina+pavan+kalyaan-dh77a25b9ac767481baad1a07a94430cad_615889a061e911ed9a3e335327c1bddd