Sat. Apr 20th, 2024
OYO_rithesh

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, గుర్గావ్,మార్చి 11,2023: ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో గురుగ్రామ్‌లోని తన అపార్ట్‌మెంట్ 20వ అంతస్తు నుంచి పడి మరణించాడు.

ఆత్మహత్యగా అనుమానిస్తున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అనే అంశంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ (65) హర్యానాలోని గుర్గావ్‌లో 20వ అంతస్తు నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రమేష్ అగర్వాల్ 20వ అంతస్తు నుంచి కిందపడటంతో ఎముకలన్నీ విరిగిపోయాయని, దీంతో ఆయన మరణించాడని, పోస్టుమార్టం చేసిన డాక్టర్ వెల్లడించారు.

పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శరీరంలోని దాదాపు అన్ని ఎముకలు విరిగిపోయాయి. దీంతో పాటు అంత ఎత్తు నుంచి కిందపడటం వల్ల పక్కటెముకలన్నీ విరిగి పగిలిపోయాయని చెప్పాడు.

అతని శరీరం నుంచి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం తీసుకున్నారు. నివేదిక వచ్చిన తర్వాతే పూర్తిగా చెప్పగలమని ఆయన చెబుతున్నారు.

మరోవైపు ప్రమాదం జరిగినప్పటి నుంచి అగర్వాల్ కుటుంబంమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో వారి ఇంటి గేటు వద్దే మీడియా గుమిగూడింది. ఈ నేపథ్యంలో ఇంటి గేటు వద్ద భద్రతను కూడా సిద్ధం చేశారు.

తండ్రి పడిపోయిన విషయం కుటుంబ సభ్యులకు తెలియదు..

రమేష్ అగర్వాల్ 20వ అంతస్తు నుంచి కిందపడిన విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఘటన సమయంలో రితేష్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఫ్లాట్‌లో ఉన్నారు.

కింద నేలపై రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని చూసిన అపార్ట్ మెంట్ లోని సెక్యూరిటీ గార్డులు తన సూపర్‌వైజర్‌కు సమాచారం అందించారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకున్నారు. దీంతో బంధువులు వెంటనే వారితో పాటు ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు వెల్లడించారు.

రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ ఆత్మహత్యగా అనుమానిస్తున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అనే అంశంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

రమేష్ అగర్వాల్ తన భార్యతో కలిసి ది క్రెస్ట్ కండోమినియం, డీల్ ఎఫ్ ఫేజ్-4లో నివసిస్తున్నాడు. 20వ అంతస్తు నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు శుక్రవారం సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) వీరేంద్ర విజ్ తెలిపారు.

OYO_rithesh

రితేష్ అగర్వాల్ మార్చి 7, 2023న వివాహం చేసుకున్నారు. మృతుడు ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్‌గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లాట్‌లో రితేష్ అగర్వాల్, అతని తల్లి ,అతని భార్య గీతాన్షా సూద్‌ ఉన్నారు. రితేష్ అగర్వాల్ గీతాన్షా ను మార్చి 7తేదీన వివాహం చేసుకున్నారు.

రితేష్ అగర్వాల్ తన తండ్రితో కలిసి ఈ అపార్ట్‌మెంట్‌లో లేనని చెబుతు న్నారు. రితేష్ అగర్వాల్ కుటుంబం ఒడిశాలోని రాయగడలో ఉంటుంది. ఇక్కడ అతని తండ్రి రమేష్ అగర్వాల్ సిమ్ కార్డులు విక్రయించే చిన్న దుకాణాన్ని నడిపేవారు. మార్చి 7న జరిగిన రితేష్ అగర్వాల్ వివాహానికి దేశంలోని, ప్రపంచంలోని ప్రముఖులు హాజరయ్యారు.

ఇందులో జపాన్ కంపెనీ సాఫ్ట్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మసయోషి సన్ కూడా హాజరయ్యారు. రితేష్ దంపతులు వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. దీంతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కూడా వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చారు.