Fri. Mar 29th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 2, 2023: హైదరాబాద్‌కు చెందిన14 ఏళ్ల నిష్కా అగర్వాల్ అరుదైన ఘనత సాధించింది.

జాతీయ ఛాంపియన్‌ గా నిలిచి తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. కేరళలో డిసెంబర్ 30, 2022 నుంచి జనవరి 2 వరకు జరిగిన 57వ జూనియర్ నేషనల్ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించింది.

ఆమె ఛాంపియన్‌గా మారడం ద్వారా చరిత్రను తిరగరాసింది. మన రాష్ట్రం తరపున అరుణా రెడ్డి 2011లో ఈ టైటిల్‌ని గెలుచుకున్నారు. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత నిష్కా అగర్వాల్ ఈ ఘనతను సొంతం చేసుకుంది.

Nishka_

57వ జూనియర్ నేషనల్స్‌లో డిసెంబర్ – జనవరిలో ఆమె 5 బంగారు పతకాలు. 2022లో డిసెంబర్ 2న ఆమె ఈజిప్టులో జరిగిన ఫారోస్ కప్‌లో స్వర్ణం అందుకుంది.

తాజాగా 57వ జూనియర్ నేషనల్స్ గ్వాడియం అండ్ అంప్ సీబీఎస్సీ కేటగిరిలో మూడు బంగారు పతకాలను గెలుచుకుంది.

నిష్కా అగర్వాల్ 2021లో ఖేలో ఇండియాలో సిల్వర్ మెడల్ కూడా గెలుచుకుంది. జమ్మూలో జూనియర్ నేషనల్‌లో ఒక రజతం సాధించింది.

2023 సంవత్సరంలో జూనియర్ ఆసియా ఛాంపియన్‌షిప్ కోసం భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతోంది. 2024, 2028 ఒలింపిక్స్ లో దేశం కోసం గోల్డ్ పతకాన్ని తెస్తానని అంటోంది నిష్కా.

నిష్కా అగర్వాల్ ఎక్కువగా ఇంటిలో చదువుకుంటుంది. భారతదేశంలోని ఏకైక ఎఫ్ఐజీ బ్రీవెట్ హోల్డర్ మనోజ్ కుమార్ రాణా విద్యార్థి, ఆమె ఇప్పుడు గౌడియంలో శిక్షణ పొందుతోంది.
.