Fri. Apr 19th, 2024
Vaddirajuravichandra_MP

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 30, 2022: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు వియ్యంకుడు, మంత్రి కే.టీ.రామారావు మామ పాకాల హరినాథరావు అకాల మృతి చెందారు.

ఆయన మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నగరంలోని మహాప్రస్థానంలో ఆయన పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు వద్దిరాజు రవిచంద్ర. అంత్యక్రియలలో పాల్గొన్నారు.

Vaddirajuravichandra_MP

శోకతప్తులైన కే.టీ.రామారావు, ఆయన కుమారుడు హిమాన్షు,హరినాథరావు కుమారులు రాజు,శైలేందర్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను ఎంపీ రవిచంద్ర పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.