Thu. Mar 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 14, హైదరాబాద్: యువ కళా వాహిని సంస్థ మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ జర్నలిస్టు గా మీడియా ఎక్సలెన్సీ 2019 ఆవార్డును టెన్ టీవీ అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ కుమార్ కు బహుకరించారు.హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సతీష్ ను ప్రముఖ సినీ నటి కలైమామణి షావుకారు జానకి, మాజీ సీఎం రోశయ్య, కళాబంధు సారిపల్లి కొండలరావు, అలనాటి నటీ మణులు జమున, గీతాంజలి, ప్రముఖ రచయిత్రి కెవి కృష్ణకుమారి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మీడియాతో సినీ రంగంలో లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డును షావుకారు జానకికి, ఎక్సలెన్స్ అవార్డులను ప్రముఖ నిర్మాత ఎస్. గోపాలరెడ్డి, దర్శకులు ముత్యాల సుబ్బయ్య, రేలంగి నరసింహారావు , ప్రముఖ సంగీత దర్శకులు ఆనంద్, ప్రసాద్స్ ల్యాబ్స ఐ మ్యాక్స్ అధినేత ప్రసాద్ కు బహుకరించారు.. అలాగే బుల్లి తెర అవార్డులను బహుకరించారు..

సతీష్ గతంలో ప్రతిష్టాత్మక నంది అవార్డుతో పాటు నేషనల్ టెలివిజన్ అవార్డు, హై రేంజ్ అంతర్జాతీయ పుర్కసారంతో పాటు పలు రాష్ట్ర జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.. ఇప్పటి వరకు అటు సాక్షి ఇటు 10 టీవీతో కలిపి 7 వేల 886 పొలిటికల్ చర్చలతో పాటు దాదాపు 421 మంది రాజకీయ ప్రముఖులతో పేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈటీవీలో రిపోర్టర్ గా సీనియర్ రిపోర్టర్ గా ఐదు బెస్ట్ స్టోరీ అవార్డులు, ఉత్తమ రిపోర్టర్ గా ప్రశంసలు అందుకున్నారు..