Fri. Mar 29th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 26,2023: మహావీర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (MHRC) మేనేజింగ్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు రాష్ట్రప్రభుత్వం వారికిచ్చిన భూమిని ఫ్రీ హోల్డ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు

1975 లో GO నం.1095లో తమకు కేటాయించిన భూమిని ఇప్పుడు ఫ్రీహోల్డ్ మంజూరు చేయడం జరిగింది. ఇది నామమాత్రంగా కనీసం సంవత్సరానికి రూ.12/- చొప్పున మూడున్నర ఎకరాల భూమిని ముప్పై సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఇప్పుడు మహావీర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఫ్రీహోల్డ్ ల్యాండ్‌గా మార్చేందుకు ముఖ్య మంత్రి ఆమోదం తెలిపారు.

వారంలో జిఒ విడుదలయ్యే అవకాశం ఉందని, పనులు వేగంగా జరుగుతున్నాయని ఎంహెచ్‌ఆర్‌సికి చెందిన భగవాన్ మహావీర్ మెమోరియల్ ట్రస్ట్ (బిఎమ్‌ఎమ్‌టి) చైర్మన్ మహేంద్ర రంకా తెలిపారు.

ఇప్పుడు అది విస్తరణ దిశలో ఉంది. పూర్తి స్థాయి గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. కార్డియాలజీ విభాగాన్ని కూడా పునరుద్ధరించాలని యోచిస్తోంది. ఐసీయూను ఆధునీకరించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విస్తరణ కార్యక్రమంపై రూపాయలు 6 నుంచి 7 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని ప్రకటించింది.

చైర్మన్ మహేంద్ర రంకా మాట్లాడుతూ భవిష్యత్తులో వృద్ధుల కోసం ప్రత్యేకంగా మెడికల్ స్పెషాలిటీ అయిన జెరియాట్రిక్స్‌ను ప్రారంభించాలని MHRC ఆలోచిస్తుందని చెప్పారు. ఆసుపత్రిలో 220 పడకల పడకల సామర్థ్యం ఉందని, సమీప భవిష్యత్తులో పడకల సామర్థ్యాన్ని పెంచే అవకాశం లేదని అన్నారు.

మహావీర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (MHRC) మేనేజింగ్ కమిటీ, స్టాండింగ్ కమిటీ, మొత్తం జైన్ కమ్యూనిటీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, IT పరిశ్రమల శాఖ మంత్రి K.T రామారావు , ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు ,సినిమాటోగ్రఫీ-పశుసంవర్ధక శాఖ మంత్రి,తలసాని శ్రీనివాస్ యాదవలకు తమకు కేటాయించిన భూమికి ఫ్రీహోల్డును మంజూరు చేసినందుకు ఎంహెచ్‌ఆర్‌సికి చెందిన భగవాన్ మహావీర్ మెమోరియల్ ట్రస్ట్ (బిఎమ్‌ఎమ్‌టి) చైర్మన్ మహేంద్ర రంకా ధనువాదాలు తెలిపారు

భగవాన్ మహావీర్ మెమోరియల్ ట్రస్ట్ మహావీర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్‌ను స్థాపించింది, ఇది 1978లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించబడింది. గత నాలుగు దశాబ్దాలుగా సరసమైన ధరకే పేదలకు,వెనుకబడిన వారికి సేవ చేయడానికి ప్రారంభించిన రాష్ట్రంలోని మొదటి స్వచ్ఛంద ఆసుపత్రి.

ఎప్పటికప్పుడు సహాయ, సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రికి ,తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చైర్మన్ మహేంద్ర రంకా, వైస్ చైర్మన్ సుశీల్ కపాడియా, మేనేజింగ్ ట్రస్టీ సునీల్ పహాడే, ట్రెజరర్ ట్రస్టీ సుశీల్ సంచేటి మీడియాతో ముచ్చటించారు.

MHRC అనేది ప్రఖ్యాత వైద్యులతో కూడిన మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్. ఈ కేంద్రం ప్రపంచ బ్యాంక్, WHOఅండ్ U.K, DFID (అంతర్జాతీయ అభివృద్ధి విభాగం) వంటి శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన సంస్థలచే గుర్తించబడింది. జెనెటిక్స్ అండ్ ఇమ్యునాలజీలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ,హైదరాబాద్ విశ్వవిద్యాలయాలు ఇక్కడ చేసిన పరిశోధనలకు పిహెచ్‌డి లభించింది.

లీజు హోల్డర్, భగవాన్ మహావీర్ మెమోరియల్ ట్రస్ట్ (BMMT) ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది సేవల స్వభావం కలది. ఇది ఒక “నాట్ ఫర్ ప్రాఫిట్” ప్రాతిపదికన నడుస్తుంది. భూమిపై ఫ్రీహోల్డ్ ఇవ్వమని అధికారులకు విజ్ఞప్తి గతంలో చేయడం జరిగింది.

ఇది 220 పడకల ఆసుపత్రి ఇది అన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది. సమాజానికి గొప్ప సేవలను అందిస్తోంది అని వైస్ చైర్మన్ సుశీల్ కపాడియా తెలిపారు.

ముఖ్యంగా ఆసుపత్రి డయాలసిస్ సెంటర్, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా దీర్ఘకాలిక మూత్రపిండ రుగ్మతలతో బాధపడుతున్న రోగుల సంరక్షణకు అందించిన సహకారం కోసం దేశవ్యాప్తంగా విదేశాలలో గుర్తింపు పొందింది. క్షయవ్యాధి పరిశోధన కోసం ప్రత్యేక TB క్లినిక్, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మొదటి ఆసుపత్రి మహావీర్ హాస్పిటల్. 63 డయాలసిస్ మిషన్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద డయాలసిస్ సెంటర్ మాది అని, సగటున, మేము నెలకు 3750 డయాలసిస్‌ను నిరుపేదలకు అందిస్తున్నాం”అని, ఇతర కార్పొరేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్‌కు రూ.2000-3000 చొప్పున డయాలసిస్‌కు వసూలు చేస్తుండగా మేము ఇక్కడ రూపాయలు 300/-.లకె ఆసేవలను అందిస్తున్నామని సుశీల్ కపాడియా వివరించారు.