Fri. Mar 29th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్రవరి 18, 2022: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం ఏకాంతంగా పేట ఉత్సవం జరిగింది.

మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. కోవిడ్ నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి వారికి స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో పాలు,పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.