Thu. Mar 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తెలంగాణ,డిసెంబర్ 4,2021:రాజకీయ కురువృద్ధుడు,మంత్రిమండలిలో సుదీర్ఘ  అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్,గారు ఆవేదన వ్యక్తం చేశారు. శాసన సభలో బడ్జెట్ 15సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గా పేరుపొందిన రోశయ్య గారితో కొంతకాలం ఎమ్మెల్యే గా పనిచేయడం తను గర్వపడుతున్న తెలియజేశారు. రోశయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్దిస్తున్నానని అలాగే వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.