Thu. Apr 25th, 2024
Delhi-cm

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,న్యూఢిల్లీ,అక్టోబర్ 27,2022: ఇండియన్ కరెన్సీ నోట్లపై వినాయకుడు, లక్ష్మీదేవి ఫొటోలను చేర్చాలని, తద్వారా భారత్‌ను సంపన్న దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. “ప్రయత్నాలు చేసినప్పటికీ, కొన్నిసార్లు దేవతలు, దేవుళ్ళు మనలను ఆశీర్వదించకపోతే మన ప్రయత్నాలు ఫలించవు.

మన కరెన్సీనోట్లపై గణేశుడు,లక్ష్మీ దేవి ఫోటోలు ఉండాలని నేను ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను. మన కరెన్సీ నోట్లపై వినాయకుడు ఉంటే మన దేశం అభివృద్ధి చెందుతుంది, దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రధానమంత్రికి లేఖ రాస్తాను అని కేజ్రీవాల్ మీడియా సమావేశంలో తెలిపారు.

కొత్త నోట్లపై ఒకవైపు మహాత్మాగాంధీ, మరోవైపు ఇద్దరు దేవతల బొమ్మ ఉండవచ్చని ఆయన తెలిపారు. ఇండోనేషియా ముస్లిం దేశమైనప్పటికీ తమ కరెన్సీ నోట్లపై వినాయకుడి ఫోటోను ముద్రించారని కేజ్రీవాల్ అన్నారు. “ఇండోనేషియా చేయగలిగినప్పుడు, మనం ఎందుకు చేయలేము? ఫోటోలను తాజా కరెన్సీనోట్లపై ముద్రించవచ్చు,” అని ఆయన చెప్పారు.

Delhi-cm

భారత ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో లేదని విచారం వ్యక్తం చేసిన ఆయన, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడంతో దేశం సున్నితమైన పరిస్థితిని దాటుతోందని అన్నారు. “భారతదేశం సంపన్నంగా ఉండాలని, ఇక్కడ ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉండాలని , మేము పెద్ద ఎత్తున పాఠశాలలు ,ఆసుపత్రులను తెరవాలి,” అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము అని ఢిల్లీ సీఎం కేజ్రీ వాల్ పేర్కొన్నారు.