Thu. Apr 18th, 2024
JPM srivari kalyanam_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మంజిల్లా,మార్చి29,2023: ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వెంకటేశ్వర స్వామి కళ్యాణం బుధవారం అత్యంత కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు హాజరయ్యారు.

ఈసందర్భంగా ఆలయ ఈవో కొత్తూరు జగన్మోహనరావు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జమలాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.

JPM srivari kalyanam_365

శ్రీవారి కళ్యాణానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలు మండలాల పరిధిలోని గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆలయ ఈవో పర్యవేక్షించారు. ఎర్రుపాలెం ఎస్సై ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వంశపారంపర్య వ్యవస్థాపక ధర్మకర్తలు, జమలాపురం సర్పంచి ముల్పురి స్వప్న, ఎర్రుపాలెం సొసైటీ చైర్మన్ ముల్పురి శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యురాలు శైలజ, సూపరిండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.