365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 4: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడేందుకు క్యాన్సర్ వైద్య నిపుణులు అభ్యర్థిస్తున్నారు .ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ , ప్రభుత్వం ఒక్కొక్కటిగా తమ వంతు కృషి చేస్తేనే ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మరణాలను తగ్గించగలం.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ,నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ & రీసెర్చ్ (ఎన్సిడిఐఆర్), బెంగళూరు విడుదల చేసిన నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం రిపోర్ట్ 2020 ప్రకారం దేశంలో 2020 లో క్యాన్సర్ కేసులు 13.9 లక్షలుగా అంచనా వేసింది. ప్రస్తుత పోకడల ఆధారంగా 2025 నాటికి 15.7 లక్షలకు పెరుగొచ్చని ఆందోళన వ్యక్తంజేసింది. ఈ అంచనాలు 28 జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీల (పిబిసిఆర్) నుండి సేకరించిన క్యాన్సర్కు సంబంధించిన సమాచారం మీద ఆధారపడి ఉంటాయి . అదనంగా 58 హాస్పిటల్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీలు (హెచ్బిసిఆర్) క్యాన్సర్ డేటాను అందించాయి.ప్రపంచంలో రెండవ అతిపెద్ద పొగాకు వినియోగ దేశం భారతే.\ (భారతదేశంలోని పెద్దలలో 268 మిలియన్లు లేదా 28.6%) . దేశంలో ప్రతి సంవత్సరం కనీసం 12 లక్షల మంది పొగాకు సంబంధిత వ్యాధులతో రణిస్తున్నారు. వ్యాధులకు కారణమైన పొగాకు మొత్తం ప్రత్యక్ష మరియు పరోక్ష వ్యయం 2011 లో 1.04 లక్షల కోట్లు (17 బిలియన్ డాలర్లు).
భారతదేశ జిడిపిలో ఇది 1.16%.”మన దేశంలో ఆరోగ్యం,ఆర్థిక వ్యవస్థపై పొగాకు భారాన్ని పరిశీలిస్తే, ప్రజారోగ్యం,భారతదేశం భవిష్యత్తు ,దాని యువత ప్రయోజనాల కోసం పొగాకు నియంత్రణ చట్టం COTPA సవరణల బిల్లు 2020 లో సవరణలు చేయవలసిన అవసరం ఉంది. ఈ సవరణలు భారతదేశ జనాభాను పొగాకు వాడకం హానికరమైన ప్రభావాల నుండి సమర్థవంతంగా రక్షిస్తాయి ”అని అపోలో హెల్త్ సిటీ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంచెట్టి అన్నారు. “భారతదేశంలో క్యాన్సర్ కేంద్రాల కారిడార్లలో యువ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు చూడటం నిజంగా నిరుత్సాహపరుస్తుంది. ఈ పొగాకు వైపరీత్యాలు , అకాల మరణానికి గురవుతున్న యువ తరం విశాల ప్రయోజనం కోసం పొగాకు నియంత్రణ చట్టాన్ని సవరించాలని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. ధూమపాన ప్రభావం ఇతరులపై పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం” అని యశోద హాస్పిటల్స్ (సోమాజిగుడ, హైదరాబాద్) సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె. శ్రీకాంత్ అన్నారు.గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (GATS) ఇండియా 2009 – 10 ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కేంద్ర కుటుంబ సంక్షేమం (MoHFW) గణాంకాల ప్రకారం తెలంగాణలో 17.8% పెద్దలు (15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ) పొగాకును ఏదో ఒక రూపంలో లేదా ఇతర పద్ధతిలో ఉపయోగిస్తున్నారని భారత ప్రభుత్వం తెలియజేస్తుంది. 8.3% మంది సిగరెట్ తాగేవారు, 4.2% బీడీ ధూమపానం చేసేవారు, 5.2% మంది పొగలేని పొగాకు వినియోగించేవారు ఉన్నారు.