Fri. Mar 29th, 2024
railway-passengers

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జనవరి 6,2023:ఉత్తర భారత రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైళ్లు ఢిల్లీ నుంచి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ వరకు సింగిల్, డబుల్ లైన్‌లో వేగంగా, సురక్షితంగా నడవనున్నాయి.

వాస్తవానికి ఘజియాబాద్ నుంచి దీనదయాళ్ స్టేషన్ వరకు మొత్తం ట్రాక్ (762 కి.మీ)లో మెకానికల్ ఇంటర్‌లాకింగ్‌కు బదులుగా ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనిని రైల్వే పూర్తి చేసింది. ఢిల్లీ-అంబాల మధ్య ట్రాక్ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌తో అమర్చారు.

దీనితో పాటు, ఢిల్లీ-ముంబై అండ్ ఢిల్లీ-హౌరా మధ్య గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడానికి రైల్వే ఫాస్ట్ ట్రాక్, ఫెన్సింగ్ , ట్రాక్ వైపు నిర్మాణ పనులను కూడా చేస్తోంది.

దీంతో ముంబై నుంచి హౌరా వరకు ఉన్న ట్రాక్‌లో పూర్తి వేగంతో రైళ్లను సురక్షితంగా నడిపేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అధిక జనసాంద్రత ఉన్న మార్గాల్లో మరిన్ని రైళ్లను నడపడానికి రైల్వే లైన్ సామర్థ్యాన్ని పెంచుతోంది.

దీని కింద ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఏబీఎస్) కోసం మిషన్ మోడ్ వర్క్ జరుగుతోంది. ఇప్పటివరకు, 3,706 రూట్ కిలోమీటర్లకు ABS అమర్చారు. 2,888 స్టేషన్లలో ఇప్పటివరకు మెకానికల్ ఇంటర్‌లాకింగ్‌కు బదులుగా ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను అమర్చారు.

ఇది రైల్వేలో పొడవైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ విభాగంగా కూడా మారింది.ఈ సిగ్నలింగ్ వ్యవస్థలో, ఇప్పుడు స్టేషన్ మాస్టర్ మాత్రమే అన్ని రైళ్ల రూట్‌ను సెట్ చేస్తారు.

railway-passengers

అక్కడ నుంచి నియంత్రిస్తారు. ఉదాహరణకు, బటిండా, ఢిల్లీ మధ్య ఒకే రైలు మార్గం ఉంటే, ఆ విభాగంలో 40-50 రైళ్లు మాత్రమే నడుస్తాయి.కానీ అది డబుల్ లైన్, ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటే, అప్పుడు అపరిమిత రైళ్లు సురక్షితంగా నడవవచ్చు.

రైళ్ల నిర్వహణ కూడా సురక్షితంగా ఉంటుంది. రైలు ప్రమాదాలు తగ్గడమేకాకుండా రైలు పట్టాలపై ఆత్మహత్యలు కూడా తగ్గుతాయి. రైళ్ల వేగం పెరిగితే మరిన్ని రైళ్లు ట్రాక్‌పై నడిచే అవకాశం ఉంటుంది.