Fri. Mar 29th, 2024
Garland worth Rs 44444444.44 offered to Goddess Kanyaka Parameshwari in Telangana
Garland worth Rs 44444444.44 offered to Goddess Kanyaka Parameshwari in Telangana

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,అక్టోబర్ 11,2021: కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అత్యంత విలువైన దండ సమర్పించారు. రూ.44444444.44 విలువైన కరెన్సీ నోట్లతో తయారు చేశారు భక్తులు. ఈ దండను తెలంగాణరాష్ట్రంలోని మహబూబ్ నగర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూ .4,44,44,444.44 విలువ కలిగిన కరెన్సీ నోట్లతో రూపొందించారు. ఈ దండ తయారీకి రూ .4,44,44,444.44 (నాలుగు కోట్లు, నలభై నాలుగు లక్షలు, 44 వేలు, 444 రూపాయలు, 44 పైసలు) విలువ కలిగిన కరెన్సీ నోట్లను ఉపయోగించారు.

కరెన్సీని “మహాలక్ష్మీ అవతారంలో” భాగంగా అక్టోబర్ 10 న, నవరాత్రిఉత్సవాల్లోభాగంగా ఐదో రోజున దేవాలయం మొత్తాన్ని కూడా కరెన్సీ నోట్లతో అలంకరించారు.రూ.500, రూ.100, రూ. 20 విలువ కలిగిన కరెన్సీ మాత్రమే ఉపయోగించారు. అయితే అలంకరణ చేసిన తర్వాతి రోజు ఎవరెవరి నుంచి ఎంత మొత్తం డబ్బుతీసుకున్నారో..వారందరికీ తిరిగి ఇచ్చేశారు.