Fri. Apr 26th, 2024
son's-body-was-found

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 6,2022: తిరుపతి జిల్లా ఓజిలి మండలం గ్రద్దకుంటలో సోమవారం సాయంత్రం తండ్రీకొడుకులు చెరువులో గల్లంతైన విషాద సంఘటన చోటుచేసుకుంది.

సమాచారం మేరకు తండ్రి చెంగయ్య పశువులను కడగేందుకు చెరువులోకి దిగి అందులో ఇరుక్కుపోయాడు.పశువులు ఇంటికి చేరుకున్నా తండ్రి రాకపోవడంతో కొడుకు నాగార్జునకు అనుమానం వచ్చింది.

 Father-son duo drowns in a pond in Tirupati,

చెరువులోకి దిగి తండ్రి ని వెతికే క్రమంలో అదే చెరువులో మునిగి ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తుంది. తండ్రి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా కుమారుడి మృతదేహం లభ్యమైంది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.