Fri. Apr 19th, 2024
AP_CM#jgan

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,డిసెంబర్ 20,2022: రేపు జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా చుండూరు మండలం యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరగనున్న సీఎం జగన్ పర్యటన సందర్భంగా శాంసంగ్ టాబ్ లు బైజూస్ సాప్ట్ వేర్ తో పంపిణీ ప్రారంభించనున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

ఈ నెల 21వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకుప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదన్నారు.

AP_CM#jgan

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కార్యక్రమానికి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆయన సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ సందర్భంగా యడ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ ను వీ.వీ.ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికను మంత్రులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్.పి.పరిశీలించారు.