365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి ,సెప్టెంబర్ 5,2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ లో పోలీస్ సిబ్బందికి కల్పించిన పదోన్నతులలో భాగంగా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సర్వీసు ప్రాతిపదికన అర్హతను బట్టి తొమ్మిది మంది పోలీస్ కానిస్టేబుళ్ళను హెడ్ కానిస్టేబుళ్ళుగా పదోన్నతులు కల్పించారు.
తొమ్మిది మందిహెడ్ కానిస్టేబుళ్ళుగా పదోన్నతి కల్పించిన సిటీ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా నిర్ణయం తీసుకున్నారు. పదోన్నతి కల్పించిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పారదర్శకంగా వారికి వివిధ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక విభాగాల్లో పోస్టింగులు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పోందిన పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి
జనరల్ నెం. పేరు ప్రస్తుత స్టేషన్ బదిలీ స్థానం
- PC 1749 ఎం. యానాదయ్య ఎస్.ఎన్.పురం సి.సి.ఎస్.
- PC 1583 ఆర్.శివ కృష్ణ సి.ఎస్.బి. పి.సి.ఆర్.
- PC 1925 ఎస్. సుధాకర్ గవర్నర్ పేట 1వ ట్రాఫిక్
- WPC 129 పి.రజని సి.టి.ఎఫ్. సి.టి.ఎఫ్.
- PC 2148 త్రిమూర్తులు వలవల` గవర్నర్ పేట సి.ఎస్.బి.
- PC 1816 షేక్ మహమ్మద్ జాని పెనమలూరు కృష్ణా జిల్లా
- PC 1852 టి.పుల్లారావు వన్ టౌన్ నున్న
- PC 1823 బి.శ్రీనివాసరావు పటమట సి.సి.ఎస్.
- PC 1997 బి. రమేష్ అజిత్ సింగ్ నగర్ గవర్నర్ పేట క్రైమ్