Sun. May 19th, 2024
kangana_ranaut365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 22, 2023: రాజ్య సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ శంషాబాద్ ఎయిర్ పోర్టు అవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్క నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

బావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించి కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

kangana_ranaut365

ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాధ్యతగా మొక్కలు నాటాలని కంగనా పిలుపునిచ్చారు. ఈ అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కంగనాతోపాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, GIC డైరెక్టర్ బాధావత్ పూర్ణ చందర్ నాయక్ పాల్గొన్నారు. కంగనా రనౌత్ ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని అందజేశారు.