Fri. Apr 26th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 5, 2023: బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డుప్రమాదానికి గురైన బాధితులను సమయానికి ఆసుపత్రికి చేర్చారు.

శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పలు శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో తొండుపల్లి వద్ద తన వాహనానికి 200 మీటర్ల దూరంలో ఒక బ్రెజా కారు అతివేగంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులను ఢీకొట్టింది.

ప్రమాదానికి గురైన క్షతగాత్రులను దగ్గరుండి శంషాబాద్ ట్రిడెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఏమాత్రం ఆలస్యం కాకుండా వేగంగా వారికి చికిత్స అందించారు. అతివేగంతో కారు నడిపి ప్రమాదానికి కారణమైన వాహనదారుణ్ని ఆయన మందలించారు. కాగా క్షతగాత్రులు రాజేంద్రనగర్ వాసులుగా గుర్తించగా, వారి బంధువులకు, వ్యక్తులకు బుక్క వేణుగోపాల్ సమాచారం అందించారు.