Thu. Apr 25th, 2024
krishna-rare-pics

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మచిలీపట్నం, నవంబర్15, 2022: సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సాహసానికి ప్రతీకగా నిలిచి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మా నాన్నమండలి వెంకట కృష్ణారావు గారికి కృష్ణ అత్యంత సన్నిహితులు.

1975 లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు నిధులు సేకరించడంలో శ్రీ కృష్ణ ప్రముఖపాత్ర వహించారు. 1977 మే లో అవనిగడ్డలో జరిగిన రాష్ట్ర నాటకోత్సవాలకు తన సతీమణి విజయనిర్మలతో కలిసి వచ్చారు. ఆ రోజు మా ఇంట్లో ఆతిధ్యం స్వీకరించారు. 1977 నవంబర్ 19వతేదీన దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు10 వేల రూపాయలు విరాళం ప్రకటించడమే కాకుండా, లక్ష రూపాయలు విలువచేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారని మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు.

krishna-rare-pics

ఒక సంవత్సరం పాటు తన ఆదాయంలో10 శాతం తుఫాను బాధితులకు అందచేసిన దయార్దహృదయులు కృష్ణ. కృష్ణగారితో మంగళగిరి లో స్టూడియో నిర్మాణం చేయించాలని మా నాన్న గారు స్వయంగా వెళ్లి స్థలాన్ని ఎంపిక చేసారు. దురదృష్టవశాత్తు అది ఏ కారణం వల్లనో కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత హైదరాబాద్ లో పద్మాలయా స్టూడియో నిర్మించారు.

“సూపర్ స్టార్ ” అనేది ఆయనకు ఇంటి పేరయింది. సినిమా రంగంలోనే కాక, నిజ జీవితంలో కూడా “హీరో” అని అనిపించుకున్న కృష్ణ మరణం తీరని లోటు అని, వారి ఆత్మకుశాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటు న్నానని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.