Sat. Apr 20th, 2024
Helicopter-Crash_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి16, 2023:అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలాలో ఆర్మీ చిరుత హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్లిద్దరూ మరణించారని పశ్చిమ కమెంగ్ జిల్లా ఎస్పీ బిఆర్ బోమారెడ్డి తెలిపారు.

చనిపోయిన పైలట్ల మృతదేహాలను లెఫ్టినెంట్ కల్నల్ వివిబి రెడ్డి ,మేజర్ జయంత్ ఎగా గుర్తించి, క్రాష్ సైట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈఘటనపై ఆర్మీ విచారణకు ఆదేశించింది.

గౌహతిలోని డిఫెన్స్ PRO లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ మాట్లాడుతూ, “కూలిపోయిన హెలికాప్టర్ బోమ్‌డిలా సమీపంలో షార్ట్ సోర్టీలో ఉంది. ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి.

Helicopter-Crash_365

గత ఏడాది అక్టోబర్‌లో కూడా తవాంగ్ ప్రాంతంలో సైన్యానికి చెందిన చితా హెలికాప్టర్ కూలిపోయి, చికిత్స పొందుతూ ఓ పైలట్ మరణించాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలా సమీపంలో గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన చితా హెలికాప్టర్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌(ATC)తో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం అందిందని రక్షణ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు.

బోమిడిలాకు పశ్చిమాన మండల సమీపంలో హెలికాప్టర్ కూలిపోయిందని ఆ తర్వాత తెలిసింది. చితా హెలికాప్టర్ కూడా గతేడాది అక్టోబర్‌లో కూలిపోయింది.

గతేడాది అక్టోబర్‌ 5న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఆర్మీకి చెందిన చితా హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ పైలట్లకు గాయాలు కాగా, ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

Helicopter-Crash_365

జెమిథాంక్ సర్కిల్‌లోని బాప్ టెంగ్ కాంగ్ జలపాతం సమీపంలోని న్యామ్‌జాంగ్ చు వద్ద, తవాంగ్‌లోని ఫార్వర్డ్ ఏరియా, ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు పైలట్లతో హెలికాప్టర్ సుర్వ సాంబా ప్రాంతం నుంచి రొటీన్ సార్టీపై వస్తోంది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తరువాత, రిలీఫ్ రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది, ఆపై తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్‌లను బయటకు తీసి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

ఇద్దరు పైలట్లలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ మరణించారు. తవాంగ్‌లో ఇది మొదటి హెలికాప్టర్ ప్రమాదం కాదు. 2017లో వైమానిక దళానికి చెందిన Mi-17 V5 హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు IAF సిబ్బంది,ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారు.