Fri. Apr 26th, 2024
Annamayya-aaradhanothsavams

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి16, 2023: పద్మశ్రీ డా. శోభారాజు స్థాపించిన అన్నమాచార్య భావనా వాహిని సంస్థ 39 సంవత్సరాలుగా అన్నమాచార్య సంకీర్తనల ప్రచారానికి కృషి చేస్తూనే వుంది. ప్రతి సంవత్సరం అన్నమాచార్య వర్ధంతి సందర్భంగా “అన్నమయ్య ఆరాధన” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సంవత్సరం 520 వ అన్నమయ్య వర్ధంతిని పురస్కరించుకొని 3రోజుల పాటు వైభవంగా జరుపనున్నారు. మొదటగా మార్చి18 వ తేదీ ఉదయం 7 గంటలకు రామకృష్ణ మఠం నుంచి టాంక్ బండ్ మీద ఉన్న అన్నమాార్యుల వారి విగ్రహం వరకు “మహానగర సంకీర్తన” నిర్వహిస్తారు.

Annamayya-aaradhanothsavams

సాందిప్ శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణలో, చిరంజీవి అభిరామ్ అన్నమయ్య వేషధారణలో విద్యార్థులు, భక్తులందరితో అన్నమయ్య విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ “అన్నమయ్య గోష్ఠిగానం” నిర్వహిస్తారు. ప్రముఖ కళాకారులు రామాచారి కొమండూరి, సాందిప్, సౌమ్య వారణాసి ,అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె. వి. రమణాచారి హాజరుకానున్నారు. మార్చి19వ తేదీ సాయత్రం 6 గంటలకు “సంకీర్తనా భావ తుషారం” అనే ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. మార్చి 20వ తేదీన అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులతో “సంకీర్తనా సుమం” అనే కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని అన్నమాచార్య భావనా వాహిని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. కార్యక్రమం అనంతరం అందరికీ స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేయనున్నారు.