365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 17,2023: తెలంగాణ ప్రజలకు ఎంతో నమ్మకమైన సిఎంఆర్ సంస్థ తన 12వ షోరూం ను ఇప్పుడు మన ఏ.ఎస్.రావ్ నగర్ లో నాలుగు అంతస్తుల స్వర్ణాభరణాల మెగా షోరూం సిఎంఆర్ లెగసి ఆఫ్ జ్యూయలరీ పేరుతో ఏర్పాటుచేశారు.
ఈ షోరూమ్ ను సినీ నటి శ్రీలీల చేతల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్ఎల్ఏ బేతి సుభాష్ రెడ్డి, ఎఎస్ రావ్ నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల మజూరిపై 50శాతం వరకు తగ్గింపు, వజ్రాభరణాలపై క్యారట్ కు రూ. 20,000 తగ్గింపు, వజ్రాభరణాల మజూరిపై ఛార్జీలపై ప్లాట్ 50శాతం తగ్గింపు వెండి వస్తువులపై తరుగు, మజూరి చార్జీలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.

ముందెన్నడూ లేని కలక్షన్లతోపాటు, సరసమైన ధరలకే ఆభరణాలు ఇస్తున్నామనీ, అలాగే సుమారు 130 మందికి ఉపాధి కలిపిస్తున్నామని సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ వెల్లడించారు. ఇంతగా మమ్మలని ఆదరిస్తూ, ప్రొత్సహిస్తున్న తెలంగాణా వినియోగదార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.