Thu. Apr 25th, 2024
food-poisoning

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అనంతపురం,డిసెంబర్ 3,2022: ఫుడ్ పాయిజన్ కావడంతో అనంతపురం జిల్లా సింగనమల కస్తూర్భా విద్యాలయం లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

సుమారు 80 మంది విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

food-poisoning

వీరిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మిగిలిన 50 మంది విద్యార్థులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాలలో నిన్న సాయంత్రం అల్పాహారం తీసుకున్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు చెబుతున్నారు.