Fri. Mar 29th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఏప్రిల్ 22,2022: బెంగుళూరు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 9 నుంచి 11వ తేదీ వరకు బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ జరుగనుంది. ఈ కార్యక్రమానికి మే 9వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 10 గంటల వ‌ర‌కు అంకురార్పణ నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా మే 10వ తేదీ ఉద‌యం 8.30 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, చ‌తుర్థ‌శ క‌ల‌శ స్థాప‌న నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌, అష్ట‌బంధ‌నం చేస్తారు.

మే 11వ తేదీ ఉద‌యం 6 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి అభిషేకం జ‌రుగ‌నుంది. ఉద‌యం 9.30 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మిథున ల‌గ్నంలో మహాసంప్రోక్షణ నిర్వ‌హిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు శాంతి క‌ల్యాణం, స్వామి, అమ్మ‌వార్ల ఊరేగింపు నిర్వ‌హించ‌నున్నారు.