Fri. Mar 29th, 2024

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్,మార్చి11, హైదరాబాద్ :పుట్టిన తేదీ:11-7-1971,తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) – శకుంతల. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగిని),పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు బండి సంజయ్. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ లో పట్టణ కన్వీనర్,పట్టణ ఉపాధ్యక్షునిగా,రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా.పనిచేశారు. కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999;1999-2003) డైరెక్టర్ గా సేవలందించారు.

బిజెపి జాతీయ కార్యాలయం,ఢిల్లీ లో ఎన్నికల ప్రచార ఇంచార్జ్ గా,భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి,పట్టణ అధ్యక్షునిగా,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్గా,రాష్ట్రఉపాధ్యక్షునిగా,నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా,జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ,తమిళనాడు ఇంచార్జి గా బాధ్యతలు చేపట్టారు. ఎల్.కె అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జి గా పనిచేశారు. కరీంనగర్ నగర పాలక సంస్థ గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గా,రెండవసారి అదే 48వ డివిజన్ నుండి భారీ మెజారిటీ తో హ్యాట్రిక్ విజయం సాధించారు.

రెండు పర్యాయాలు నగర బిజెపి అధ్యక్షుడిగా 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి,52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిల్చున్నాడు. 2019 ఎన్నికల్లో తిరిగి బిజెపి తరుపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66,009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా,రాష్ట్రంలో పోటీ చేసిన బిజెపి అభ్యర్థుల్లో ప్రథమ స్థానం లో నిలిచారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా పోటీచేసి,టీఆరెస్ కంచుకోటను బద్దలు కొట్టి 96వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.